సుగాలి ప్రీతి కుటుంబానికి 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గల్ఫ్ జనసేన నాయకులు

సుగాలి ప్రీతి

      కర్నూలు,  (జనస్వరం) :  పాశవిక దాడిలో అశువులు బాసిన కర్నూలు పట్టణానికి చెందిన సుగాలి ప్రీతి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు చూసి చలించిన గల్ఫ్ – జనసేన నాయకలు  ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు సుగాలి పార్వతమ్మకు రూ.50,000/- నగదును గల్ఫ్ – జనసేన ప్రతినిధులు మాదాసు నరసింహ గారు, గుంటూరు జిల్లా నుంచి యర్రగోపుల జయదీప్ గారు అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా యర్రగోపుల జయదీప్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గల్ఫ్ జనసేన తరపున శ్రీ చందక రామ్ దాస్ గారు, శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారు, శ్రీ కేసరి త్రిమూర్తులు గారు, శ్రీ పగడాల అంజన్ కుమార్ గారు, శ్రీ కంచన శ్రీకాంత్ గార్ల సహాయ సహకారాలతో  కర్నూలు వచ్చి సుగాలీ ప్రీతీ కుటుంబ సభ్యులకు  నగదును అందజేయడం జరిగిందని తెలిపారు. శ్రీ మాదాసు నరసింహ మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా పేదలకు, ఆపదలో ఉన్నవారికి గల్ఫ్  జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీ షేక్ అర్షద్ గారు, శ్రీ అరిగెల నాగేష్ గారు, శ్రీ మామిళ్ల సురేష్ గారు, శ్రీ ఓబులేష్ గారు,శ్రీ సుధాకర్ గారు‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way