వరద బాధిత కుటుంబానికి గూడూరు జనసేన నాయకులు ఆర్థిక సాయం

గూడూరు

     గూడూరు, (జనస్వరం) :  గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నెల్లటూరు ప్రగతి నగర్ లో వరదల ప్రభావంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గురువారం ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. నెల్లటూరు ప్రగతి నగర్ లోని చికవోలు వెంకట రమణమ్మ వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతుండడంతో ఆమె కుటుంబానికి నిత్యావసర సరుకులు, దుస్తులు, ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. అలాగే ఇళ్ల చుట్టూ బురద ఉండడంతో పాటు కనీసం వీధిలైట్లు లేక పాములతో ఇబ్బంది పడుతున్నామని, చిన్న పిల్లలు ఉన్నారని స్థానికులు తెలియచేయడంతో స్పందించిన జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనిపై స్పందించిన కమిషనర్ సచివాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓంకార్, సాయి, మోహన్, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way