మూగజీవులకు దాహం తీరుస్తున్న గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక చోట్ల మూగజీవులకు నీటి కుండీలను గుడివాడ పట్టణ జనసైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పట్టణంలో ప్రజలకు చలివేంద్రాలుతో పాటు మూగజీవులకు నీటి కుండీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. దయచేసి ప్రజలు మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మూగజీవాలకు పక్షులకు నీరుని అందించాలని కోరారు. జీవితమంటే జననం మరణం కాదని సమాజానికి పదిమందికి ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరమార్ధం అని తెలియజేశారు. మా పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలను గుర్తించి సమస్యల మీద పోరాటం చేస్తున్నామని, సేవే మార్గం – ప్రేమే లక్ష్యం అని ప్రజలతో మమేకమై ఉంటున్నామని గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో మా అందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, అయ్యప్ప, జగదీష్, మెకానిక్ మూర్తి, చింత దుర్గా రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way