Search
Close this search box.
Search
Close this search box.

సొంత నిధులతో రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ఓవర్ బ్రిడ్జి పైన పూర్తిగా గుంతల మయం తో ప్రజలు ఇబ్బందులు గమనించిన పట్టణ జనసైనికులు సొంత నిధులతో గుంతలు పూడ్చటం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు రామకృష్ణ (RK) మాట్లాడుతూ గుడివాడ నుంచి విజయవాడ కు వేలాది వాహనాలు మరియు నాయకులు అధికారులు తిరుగుతున్నారు కానీ ఏ ఒక్క అధికారి నాయకుడు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. గోతులు వల్ల ప్రజలు ఇబ్బంది పడటంతో మా సొంత నిధులతో గోతులు పూడ్చటం జరిగింది అని తెలియజేశారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి వారు మున్సిపల్ అధికారులు రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చి వాహనదారులను మరియు ప్రజలను ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మండుటెండలో వాళ్ళు పడుతున కష్టాన్ని చూసి ప్రభుత్వం చేయలేకపోయినా మీ జనసైనికులు చేస్తున్నారని మీకు మీ నాయకుడుకు మంచి రోజులు వస్తాయి అంటూ పలువురు వాహనదారులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, జగదీష్, చింత దుర్గా రామకృష్ణ, నాగ సాయి, చరణ్, పలనాటి అజయ్, ఎమ్మెల్యే ప్రకాష్, నాగ శీను, మెకానిక్ మూర్తి గారు స్థానిక యువత పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way