అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు

గుడివాడ

      గుడివాడ, (జనస్వరం) :   కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ పేదఎరుకపాడు గ్రామంలో ఎవరూ లేని అవ్వ చనిపోవడంతో జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ మృతదేహానికి జనసైనికులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) గారు మాట్లాడుతూ పేదఎరుకపాడు గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా అనేక ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్న దాసిన సత్యమ్మ  గారు కరోనా మహమ్మారి వల్ల పనులు లేక తినటానికి తిండి లేక అనారోగ్యంతో మరణించడంజరిగింది. జనసైనికులు ద్వారా ఈ సమాచారం తెలుసుకుని ఆ అమ్మకి అంతక్రియలు చేయడం జరిగిందని తెలియజేసినారు. ఇటువంటి నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు ఏర్పాటు చేసి అనాధలను ఆదుకోవాలని తెలియజేసినారు. అలాగే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవతా హృదయంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. మా నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలు తీరుస్తున్నామని,  ప్రజల పక్షాన నిలబడే పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన జన సైనికులకు నా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, జగదీష్, మహమ్మద్ హుస్సేన్, సంఘ సంస్కర్త రామిశెట్టి మురళి గారు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way