Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజి సమస్యలను తీర్చాలని మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందించిన గుడివాడ జనసేన నాయకులు రామకృష్ణ

జనసేన

        కృష్ణా ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ వద్ద డ్రైనేజ్ మురికి కాలువలో చెత్త చెదారం పేరుకుపోయి దుర్గoదమైన వాసనతో దోమలతో ప్రయాణికులు ఇబ్బంది పడటంతో ఆ సమస్యను వినతి పత్రం ద్వారా మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారికి అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు.. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ బస్టాండ్ పరిధిలో ప్రయాణికులు ఆటో రిక్షా కార్మికులు పోలీసు వారు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారని ఆ పరిసరాలలో డ్రైనేజీ వ్యవస్థ పూడికతో నిండి పోయిందని దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ సమస్యలు స్పందన ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగిందని యుద్ధ ప్రాతిపదికOగా డ్రైనేజ్ వాస్తు ని క్లీన్ చేసి ప్రజలకు రోగాలు రాకుండా కాపాడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, జగదీష్, కార్తీక్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way