షణ్ముఖ వ్యూహంతో భవిష్యత్తుకు గ్యారంటీ

– ఈనెల 14 నుంచి 16 వరకు జనసేన, టిడిపి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు

– ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

   తిరుపతి ( జనస్వరం ) : జనసేన షణ్ముఖ వ్యూహం..‌ టిడిపి భవిష్యత్ కు గ్యారంటీ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నాయన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గురువారం జరిగిన జనసేన టిడిపి రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 13న జరగనున్న ఉమ్మడి మేనిఫెస్టో సమావేశంలో తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిబోతాయన్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహాన్ని ప్రకటిస్తే… చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్ ను ప్రకటించారని తెలిపారు. ఈనెల 14 నుంచి 16 వరకు జనసేన, టిడిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించబోతున్నామన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని తెలిపారు. జనసేన, టిడిపి ఉమ్మడిగా చిత్తూరు జిల్లాలో 14 స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించామని, రెండు పార్టీలు ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతున్నామని ఆయన ఆ పత్రికా ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way