మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి : జనసేన నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్టం లో జరుగుతున్న మహిళలపై వరుస అత్యాచారాలను ఖండిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూ కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మొన్న వైజాగ్ లో 17 ఏళ్ల అమ్మాయి నిన్న చిత్తూర్ లో 6 ఏళ్ల అమ్మాయి ఇలా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వం. దిశ చట్టం పేరుకే కానీ చట్టం యొక్క అమలు ఏది అని కర్నూలు జిల్లా నాయకులు శ్రీ చింత సురేష్ బాబు గారు, జనసేన పార్టీ వీరమహిళ అనితశ్రీ గారు ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళ గంగావతి, శాంతి, రేణుక, మంజునాథ్, బజారి, సుధాకర్, నరసింహ, లక్ష్మన్న, ఆకెపోగు రాంబాబు, కొండల్, సతీష్ షబ్బీర్, కృష్ణ బాబు పాల్గొన్నారు.