మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం దిగిపోవాలి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత

● ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

●జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించేందుకేనా మంత్రి పదవులు

● జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు  పెండ్యాల శ్రీలత 

    అనంతపురం, (జనస్వరం) : రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలకు కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె అనంతపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు దౌర్జన్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అన్నారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అనవసర ఆరోపణలు చేయడం మంత్రులకు పరిపాటిగా మారిందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకే వీరికి మంత్రి పదవులు ఇచ్చారా అన్నట్టుగా ఉందన్నారు. తమ శాఖలపై పట్టులేని మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. వైసిపి నేతలు తమ తీరు మార్చుకోకపోతే ప్రజా క్షేత్రంలో వారికి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు  గుండాల మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీర మహిళ కాశెట్టి సావిత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way