ప్రభుత్వం వన్ టైం పట్టా పేరుతో పదివేలు రూపాయలు వసూలు చేసే విధానం వెనక్కు తీయిసుకోవాలి : అరకు జనసేన నాయకులు

అరకు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గములో హుకుంపేట మండలం బూర్జ పంచాయితీ మజ్జివలస గ్రామంలో శుక్రవారం ఉదయం జనసేనపార్టీ నాయకులు సాయిబాబా, దూరియా, పరశురామ్, సింబోయ్, ఎం పీ టి సి అభ్యర్థి, రాప, బుద్దు ఆధ్వర్యంలో ఆయా గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. అనంతరం ఈ సందర్బంగా సాయిబాబా, పరశురామ్, బుద్దు మాట్లాతుడుతూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలోనే చూస్తున్నామని ప్రజలకు సూచించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పట్టా పేరుతో పదివేలు రూపాయలు వసూలు చేసే విధానాలు తీసుకు వచ్చిందని, దీనిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి, జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ ప్రభుత్వంపై ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కీరంగి, రాంప్రసాద్, రాప, మహేష్, ఉప సర్పంచ్, సింబోయ్, లక్ష్మి, కేరంగి, అప్పలస్వామి, పెట్టిలి, మదన్ తదితరులు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way