చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన నాయకులు కాసా రవి ప్రకాష్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి రేఖ గౌడ్ గారి సూచనల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ మాట్లాడుతూ, ఇటీవలే కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం 17వ వార్డులో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన పద్మనాభం చాలా బాధాకరమని ఆవేదనని వ్యక్తపరిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి చేనేత పరిశ్రమ అన్ని పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య నికి పాల్పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసే విధంగా అడుగు వేయాలని, అదేవిధంగా కేవలం మగ్గం వేసే కార్మికుల కాకుండా ప్రతి ఒక్క చేనేత కులానికి సంబంధించిన వ్యక్తులు గుర్తించే విధంగా ప్రణాళికలు రచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటూ స్వయంకృషితో ఎదుగుతున్న చేనేత రంగానికి అవకాశాల కలిపి ఇయ్యాలని చేనేత రంగాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంటూ చేనేత కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way