పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు ఈమని కిషోర్
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం, రావిరాల గ్రామం రాష్ట్రంలో అదే విధంగా నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి మరియు గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వలన కృష్ణా నది ఉప్పొంగడంతో వరద ప్రభావిత ప్రాంతం అయిన రావిరాల గ్రామంలో వరదల వలన పంట పొలాల్లోకి నీరు చేరడంతో నష్టపోయిన పంటలని ఈరోజు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా పంట పొలాలని సందర్శించి, సంబంధిత రైతులతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ వరదల వలన సుమారుగా రావిరాల గ్రామంలో రైతులు పండించుకునే 150 ఎకరాలకు గాను 20 ఎకరాలు మినహాయించి సుమారుగా 130 ఎకరాలకు పైగానే పంట పొలాలు దెబ్బ తిని రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. రైతు పడ్డ కృషి వారి పెట్టుబడి వృధా అయిపోయిందని, ముఖ్యంగా పత్తి రైతులు ఈ వరదల వలన అతలాకుతలం అయిపోయారని, రావిరాల వాగు వలన వరదల సమయంలో ఉదృతంగా వరద నీరు పంట పొలాలలోకి వెళ్లటంతో రైతులు పంటలు పండించుకోలేక ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, త్వరితగతిన వాగుకి కట్టలు ఏర్పాటు చేయాలని రైతుల తరపున ఆయన కోరారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరియు సంబంధిత అధికారులు నష్టపోయిన పంట పొలాలని గుర్తించి రైతులకు సరిపడా న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, చైతు, గోపి, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.