Search
Close this search box.
Search
Close this search box.

వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

      ఎమ్మిగనూరు, (జనస్వరం) : భారీ వర్షాలు కురవడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో నెలలు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి భరోసాని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి పోరాడడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way