
అరకు, (జనస్వరం) : అనంతగిరి అరకు ఘాట్ రోడ్డులో కాఫీ విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు, ప్రస్తుతం టూరిస్టుల పర్యటనలు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రస్తుతం వ్యాపారాలు జరగడం లేదు. దీంతో కాఫీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు పూటగడవ లేక పస్తులతో గడుపుతున్నారు. ఇది గమనించిన జనసేన పార్టీ నాయకులు కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి గురువారం వారితో సమావేశమై చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన అనంతరం అందాల అరకు లోయ పర్యాటక కేంద్రం రోడ్ల మరమ్మతు చేపట్టకపోవడం, పర్యాటక కేంద్రం పరిధిలలో మెరుగైన రోడ్లు సదుపాయం లేకపోవడం కారణంగానే టూరిస్టుల పర్యటనలు అంతంతమాత్రంగా ఉండటంతో టూరిస్టుల పర్యటకులకు ఆధారం చేసుకొనే, గిరిజన కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారులు పస్తులతో ఉండడం ఇదే నిదర్శనమని దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి అందాల అరకులోయ పర్యాటక కేంద్రాన్ని మెరుగైన సదుపాయం కల్పించగలరని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేనపార్టీ సూచిస్తుంది. ఈ కార్యక్రమానికి జనసైనికులు, గిరిజన కాఫీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు పాల్గొన్నారు.