భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్
ఎమ్మిగనూరు జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక అందని ద్రాక్షగా మారిందని, దీనివల్ల చాలా చోట్ల భవన నిర్మాణ కార్మికులు ఏ పని లేక కూలికి తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇసుక అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలని భరోసాని కల్పించాలని రాహుల్ సాగర్ కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని, ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అని ఆయన తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు.