పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి : ఆలూరు ఇంఛార్జ్ తెర్నేకల్లు వెంకప్ప

    ఆలూరు, (జనస్వరం) : జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జి తెర్నేకల్లు వెంకప్ప మాట్లాడుతూ హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఈ నెల 21 వ తేదీన గ్రామానికి చెందిన చంద్ర(30), తాయన్న (20) పిడుగుపాటుకు గురై మరణించడం చాల బాధాకరం. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం క్రింద 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. మరణించిన కుటుంబాలకు బీమా లేనిచో APSDMA (ANDHRA PRADESH STATE DISASTER MANAGEMENT AUTHORITY) ద్వారా తక్షణమే చొరవ తీసుకొని కుటుంబాలకు అండగా నిలబడాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేశారు. అలాగే పిడుగుపాటుకు గురికాకుండా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపారు. పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలను త్వరలోనే జనసేన పార్టీ తరుపున పరామర్శిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way