అంబేద్కర్ విగ్రహం దగ్గర గోరంట్ల జనసేన నాయకులు మౌన పోరాటం

      గోరంట్ల, (జనస్వరం) : శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మని గోరంట్ల మండలం వైసిపి నాయకులు దగ్ధం చేయడంతో దానికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర గోరంట్ల జనసేన నాయకులు మౌన పోరాటం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ దిష్టిబొమ్మలు కాల్చే దాని మీద ఉన్న శ్రద్ధ గోరంట్ల అభివృద్ధిపై చూపండి అని సూచించారు. చిత్రావతి నదిపై వంతెన నిర్మించి ఆరు నెలలు కూడా పూర్తి కాగానే బ్రిడ్జి మీద గుంతలమయం కావడం మొదటిగా ఆ గుంతలు పూడ్చండని హితవు పలికారు. అలాగే హిందూపురం కదిరి ప్రధాన రహదారి కసిరెడ్డిపల్లి పెద్దవంకలో బ్రిడ్జి చిన్నదిగా ఉండటం వల్ల వర్షానికి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని వైసిపి నాయకులు వాటిపై దృష్టి పెట్టి కొత్త బ్రిడ్జి ఏర్పాటుకై పోరాడాలని అలా చేయకుండా నీతి నిజాయితీ గల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని మీరు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. మీరు నిరూపిస్తే జనసేనపార్టీ వదిలేసి మేమంతా వైసీపీ పార్టీలో కొనసాగుతామని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల నాయకుడు సంతోష్,కార్యక్రమల జిల్లా కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, ఐటీ పెనుకొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, వీర మహిళ కావేరి, మండల నాయకులు నాగేష్, నాగేంద్ర, మల్లికార్జున,నరేశ్, తిరుపాల్, వెలమద్ది శ్రీనివాస్, గంగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way