రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి

జనసేన

        పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం జగ్గరాజుపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో శేషుకుమారి గారు స్థానికులతో, మత్సకరులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారికి వున్న మంచినీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు, తుపాన్ సమయాల్లో సముద్రం కోతకు గురి కాకుండా రక్షణ గోడ నిర్మించాలని మరియు సమస్యలు పరిష్కరించాలి అని కోరారు. స్థానిక జనసైనికులు మరియు మహిళలు ఉత్సాహంగా పాల్గొని, వారి మద్దతు తెలిపారు. శేషుకుమారి గారు మాట్లాడుతూ జగ్గరాజుపేట గ్రామంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఎం చేస్తున్నారు అని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారికున్న రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారికి కావలసిన గట్టును కూడా ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, వైస్ ప్రెసడెంట్ దొడ్డి దుర్గ ప్రసాద్, సురాడ శ్రీను, మెరుగు ఇజ్రాయేల్, విజయ్, ప్రసాద్, స్వామి, గోపి, నరసింహాముర్తి, రాజేష్, బాబ్జీ, కోటి, బాలు, అభి, రాజేష్, ప్రసాద్, జనసైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way