బొబ్బిలి వీణకు ప్రాముఖ్యతను కల్పించండి : జనసేన నాయకులు

బొబ్బిలి వీణ

      బొబ్బిలి ( జనస్వరం ) : పట్టణం 8వ వార్డు అమ్మి గారి కోనేరు గట్టు వద్ద గల కూడలిలో, ప్రపంచమంతట ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యాలని  జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు డిమాండ్ చేశారు.  ఒకవేళ బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యకుండా మీకు నచ్చిన విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని చేస్తే ఊరుకోబోమని, మన బొబ్బిలి సంస్కృతి, చరిత్రను మన భావితరాలకు మరియు ఈ ప్రపంచానికి చాటిచెప్పేలాగా 2024 లో జనసేన+టీడిపి ప్రభుత్వం స్థాపించాక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని బాబు పాలూరు గారు మీడియా ముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, బొబ్బిలి నాయకులు లెంక రమేష్, పల్లెం రాజా, చీమల సతీష్, శ్యామ్, రమేష్, మోతి దాసు, ఉమా మహేష్, పొట్నూరు జన, జగన్నాథం, వెంకట రమణ, చంద్రమౌళి, సతీష్, గౌరీ శంకర్, మణికంఠ తదితర జనసైనికులు మరియు వీర మహిళలు బంటుపల్లి దివ్య, గైనేడి రమ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way