ఘనంగా జనసేన ఆత్మీయ సభ : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

     టెక్కలి, (జనస్వరం) : టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంలో టెక్కలి నాలుగు మండలాల జనసైనికుల ఆత్మీయ సమావేశం ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాల జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో కణితి కిరణ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలు వేస్తామని, అలాగే బూత్ స్థాయిలో బలోపేతానికి బూత్ ఏజెంట్లను నియమించి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని గ్రామల్లో బలంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలని తెలిపారు. పార్టీ బలోపేతంలో భాగంగా వీర మహిళలను సాదరంగా ఆహ్వానించాలని మహిళలను పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చెయ్యాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఉన్న జనసైనికులు ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి, అలాగే ఓటుహక్కు పొందేలా చెయ్యాలని తెలిపారు. ప్రస్తుత వైసీపీ నాయకత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి గ్రామస్తునకు తెలియజేసి జనసేన అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహం అనుసరించి ఈ రాష్ట్ర యువతకు ఏవిదంగా ఉపాధి కల్పిస్తుందో వివరించాలని, రాష్ట్రన్ని అప్పుల ఊబి నుండి ఎలా గట్టేంకించాలో మన అధినాయకుడి వద్ద ప్రణాళిక ఉందని తెలిపారు. త్వరలోనే వైసీపీ వ్యతిరేక విధానాలను జనశ్రేణులు వీధి పోరాటాలతో జనాలకు వివరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way