దేవాలయాలపై దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ గేదెల చైతన్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

దేవాలయాలపై దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ గేదెల చైతన్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

       రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాకుళంలో హనుమాన్ విగ్రహం వద్ద పాతపట్నం నియోజకవర్గం జనసేన అభ్యర్థి గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సొంత జిల్లాలో జరుగుతున్న ఘటనలు అదుపుచేయడం చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గవి కాదని, హిందువులకు క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జనసేన నాయకులు గురుప్రసాద్ మాట్లాడుతూ తిరుమల డిక్లరేషన్ మరియు హిందూ దేవతలపై కొడాలి నాని వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వకపోతే మంత్రి గారి వ్యాఖ్యలు వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్లు అనుకోవాల్సివస్తుంది అని విమర్శించారు. కొడాలి నాని హిందువులకు క్షమాపణలు చెప్పి మంత్రి పదవి నించి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఉదయ్ కుమార్, ప్రవీణ్, వెంకటేష్, సాయి, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way