రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గేదెల చైతన్య

  పాతపట్నం, (జనస్వరం) :  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం జనసైనికుడు అభిషేక్ కి జనసేనపార్టీ తరపున 20వేల రుపాయలు ఇంచార్జీ గేదెల చైతన్య  హాస్పిటల్ కి వెళ్లి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభిషేక్ పూర్తిగా కోలుకునే వరకు జనసేన పార్టీ అలాగే జనసైనికులు అందరూ అండగా ఉంటామని  భరోసా ఇవ్వడం జరిగింది.