Search
Close this search box.
Search
Close this search box.

పాతపట్నం నియోజకవర్గములోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన జనసేన నాయకులు గేదెల చైతన్య

     పాతపట్నం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం  నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనపార్టీ 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో అధికార పార్టీ నాయకులు ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని జనసేనపార్టీ నాయకులు గేదెల చైతన్య ఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరితున్నాయని అన్నారు. అలాగే పాతపట్నం నియోజకవర్గంకు సంబంధించి మెలియాపుట్టి గిరిజనుల సమస్య, పాతపట్నం మండలం త్రాగు నీరు సమస్య, మరిన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికు తీసుకెళ్ళి పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ గేదెల చైతన్య వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way