Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కల్పించిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

    పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వీరఘట్టం మండలం కంబర వలస పాలకొండ మండలం గుడివాడ గ్రామల్లో పర్యటించడం జరిగింది. జనసైనికులకు, ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని క్రియాశీలక సభ్యులకు సూచించారు. జనసేన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని వాళ్ళకి క్రియాశీలక సభ్యులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విధంగా బలమైన మార్పుకు శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉందని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way