Search
Close this search box.
Search
Close this search box.

దంపెట్ల శివ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

దంపెట్ల శివ

      అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకులు దంపెట్ల శివ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్పానిస్, జపనీస్, కొరియన్ క్లాసులు అనంతపురం లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. తదనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని దంపెట్ల శివ గాంధీ చిత్ర పటానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాల ద్వారా దేశాన్ని ఏకం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం ఎలాగైతే పోరాడి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం పొందారు.  ఆలాగే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను, అవినీతి పాలనను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు. గాంధీ గారు చెప్పినట్టు సత్యం. అహింస మార్గాల ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి ఆంధ్ర ప్రజలకు స్వాతంత్ర్యం తెద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ రాయుడు,, జనసేన నగర ఉపాధ్యక్షులు దివాకర్,, కాపు సేన జిల్లా ప్రధాన కార్యదర్శి తోటప్రకాష్, మురళి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way