రాప్తాడులో జనసేన నాయకుడు రమణ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ జయంతి వేడుకలు
గాంధీజీ కలలు గన్న గ్రామాస్వరాజ్యం అభివృద్ధి కోసం ముఖ్యంగా 1994 గ్రామ స్వరాజ్యం పంచాయితీ రాజ్ యాక్ట్ ప్రకారం ఏప్రిల్ 4న మరియు అక్టోబర్ 3న గ్రామ సభలు జరుగుతాయి. ఇంతవరకూ మనకు ఇటువంటివి జరుగుతాయని తెలియకపోవచ్చు కానీ జనసేన ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో మన వంతుగా మన అనంతపురం జిల్లాలో పంచాయతీ నిధుల మీద ఇంతకు ముందే మనము సమాచారాన్ని తెలియజేశాము. ఇప్పుడు అక్టోబర్ 3న గ్రామసభలు జరుగుతున్న సందర్భంగా పంచాయతీ నిధులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టారు? అని ప్రతి ఒక్కరు అడగొచ్చు. కావున జన సైనికులారా, జనసేన కార్యకర్తలారా మన ఊరి ప్రజలందరని చైతన్యవంతుల్ని చేసి ఈ గ్రామ సభలకు తీసుకుపోండి. ఏ ఊర్లో/పంచాయతీలో అయినా గ్రామ సభ పెట్టకపోతే సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి. గ్రామ సభలో పాల్గొనడం ప్రతి ఒక్క పౌరుడిధర్మం. మీరు పాల్గొని మీ ఊరి సమస్యలను అక్కడ తెలియజేయండి. వాటికి పరిష్కారం చూపాలి నిధులు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి అని జనసేన నాయకుడు రమణ అన్నారు. అనంతరం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఫోటోలకు పూల మాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు.