పవన్ కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్న గాజువాక

   గాజువాక ( జనస్వరం ) : జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు గారి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. గెలుపే లక్ష్యంగా రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఇప్పటికే నిర్మాణమైన కార్యవర్గం బూతు స్థాయి లో ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్వేచ్చగా ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా ఓటరు లిస్టులను పరిశీలన చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారు గాజువాక నుంచి శాసనసభకు పోటీ చేయాలని కోన తాతారావు గారు సర్వ సభ్య సమావేశం లో తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యవర్గం ఎగర్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. గాజువాక లో ఉన్న దీర్గ కాలికంగా సమస్యల తో ప్రజలు సతమతమౌతున్నారు. ఉక్కు నిర్వాసితులు, గంగవరం పోర్టు నిర్వాసితులు, ఫార్మా నిర్వాసితులు, APIIC నిర్వాసితులు, గాజువాక హౌస్ కమిటి వంటి అనేక సమస్యలు నియోజకవర్గం లో ఉన్నందున, గాజువాక లో జనసేన పోటీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, పోల రౌతు వెంకట రమణ, గవర సోమశేఖర్, మాక షాలిని, కరణం కనకారావు, దాసరి జ్యోతి, రెడ్డి, కోన చిన అప్పారావు, రౌతు గోవింద్, అరవింద్, త్రినాథ్, చైతన్య, కనకరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way