Search
Close this search box.
Search
Close this search box.

ఇళ్ల పట్టాల పంపిణి పేరుతో జగన్ రెడ్డి చేసింది పెద్ద మోసమే : గాదె వెంకటేశ్వరరావు

గాదె వెంకటేశ్వరరావు

      గుంటూరు ( జనస్వరం ) :  జిల్లా కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వవహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రసంగించారు. గాదె మాట్లాడుతూ.. జగన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని చూసే సామెతలు కనిపెట్టారు. ఆయన ఒక దొంగ అని దేశం మొత్తం తెలుసు. 16 నెలలు జైలులో ఎందుకు ఉన్నారో అందరికి తెలుసు. కొన్ని వేల కోట్లు స్కామ్ చేసిన కేసులో ముఖ్య ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి గారు ఒక్క కేసు కూడా లేని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దొంగల ముఠా అంటూ సంబోధించడం హాస్యాస్పదం. ఇప్పుడు ఆయన పెద్ద మోసగాడు.. మోసగాడు అని ఎందుకు సంబోధిస్తున్నానో అందిరికీ తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరువాత మాటలలో తప్పించి ఒక ఐటీ పరిశ్రమ తీసుకువచ్చింది లేదు, ఒక నిర్మాణం చేసినిది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. కేవలం డబ్బు పంచడం తప్పించి ఆయన ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదు. నిన్న కూడా ఇళ్ల పట్టాల పంపిణి పేరుతో చేసింది పెద్ద మోసమే.. కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పట్టాల వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదని.. ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులందరూ చేతగాని పరిస్థితుల్లో ఉండడం వల్ల నిన్న అంత పెద్ద మోసం జరిగింది. అసలు సీ.ఆర్.డి.ఏ నుండి ప్రభుత్వం భూముల్ని పంచే అర్హత లేదు. ఎమ్మార్వోలు వాటికి సంతకాలు పెట్టే అధికారం అస్సలు లేదు. కానీ చట్ట బద్ధత లేకుండా కొంత మంది అమాయకులకు ఆశ చూపించి వారిని తీసుకొచ్చి పట్టాల పంపిణి కార్యక్రమం చేశారు. నిన్నటి రోజున ప్రజలందరూ చూసారు, వివేకానంద రెడ్డి గారి హత్యా కేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి అంతా ముందే తెలిసి జరిగింది అని సీబీఐ వారు కుండ నడ్డలు కొట్టేశారు. సీబీఐ ఒక ముద్దయిని అరెస్ట్ చెయ్యాలని రాష్ట్ర పొలిసు శాఖని కోరితే పొలిసు వారి నుండి మద్దతు దొరకకపోవడం ఎంత సిగ్గు చేటో రాష్ట్ర ప్రజలందరి గమనించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నాం. సిబిఐ కోర్టులో పేర్కొన్న విషయంలో అర్ధరాత్రి 12 హెగంటల నుండి తెల్లవారు జామున 4 గంటల వరకు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారికి వాట్సాప్ వీడియో కాల్స్ వెళ్లాయి అంటే.. గతంలో శ్రీ రఘు రామ కృష రాజు గారు పేర్కొన్న విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సీఐడీ పోలీసులు కొడుతున్నప్పుడు వారి దగ్గర నుండి వాట్సాప్ లో ఫొటోస్, వీడియోస్ వెళ్లాయని.. వాటిని చూసి ఆయన శునకానందం పొందారన్న విషయాన్నీ ప్రజలందరికి గుర్తు చేస్తున్నాను. వీటినన్నిటిని కప్పి పుచ్చుకోవడానికి నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. రేపో మాపో అవినాష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా వివేకానందరెడ్డి గారి హత్యా కేసులో నిందుతుడవ్వడం ఖాయం. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న మోసాలనై గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సొంత బాబాయిని చంపించి ఆ కేసులో ఎన్ని అబద్దాలు ఆది ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నాడో, కేసు ఉచ్చ్చు బిగుసుకున్న ప్రతి సారి ఢిల్లీ ఎహ్ విధంగా పరిగెడుతున్నాడో అందరు గమనించాలని కోతుకుతున్నాము. ఈ రాష్ట్రంలో ఎటువంటి నేర చరిత్ర లేని నాయకుడు శ్రీ పవన్ క్లయం గారిని ముఖ్యమంత్రిని చేసుకునెలా ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి అధికారాన్ని అందించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుతున్నాము అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆడప మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, చట్టాల త్రినాథ్, కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మావతి, నెల్లూరు రాజేష్, తన్నీరు గంగరాజు, బిసా బత్తుని సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way