Search
Close this search box.
Search
Close this search box.

లోకం మాధవి ఆధ్వర్యంలో ఉచిత రక్షిత మంచి నీరు

లోకం మాధవి

       నెల్లిమర్ల ( జనస్వరం ) :  నియోజవర్గ నాయకురాలు  లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఉచిత రక్షిత మంచి నీరు అందించారు. దాహం దప్పికతో అలమటిస్తున్న ప్రజలకు ట్రాక్టర్ ద్వారా ఉచిత మంచి నీటి సరఫరా అందిస్తున్నారు. నీటి రుణం తీర్చుకోలేనిది..నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం కొండరాజు పాలెం గ్రామ ప్రజలు ప్రశంసలు అందించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శ్రుతిమించిపోతున్నాయి.. అందుకు నిదర్శనమే ఈ కొండరాజు పాలెం గ్రామం.. వైసీపీ నాయకుల మాట వినలేదు అనే ఉద్దేశం తో వేసవి కాలం వేల ఆ గ్రామ లోనీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ గ్రామంలోని మంచినీటి సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు చూసి చలించిపోయిన లోకం మాధవి గారు.. పేద కుటుంబాల పై నీటి భారాన్ని నివారించాలి అనే సంకల్పంతో జనసేన రక్షిత మంచినీటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడిచిన వారం రోజుల నుండి ప్రతీ రోజు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం ట్రాక్టర్ల ద్వారా రక్షిత మంచి నీరు పంపిణీ చెయ్యటం జరుగుతుంది. ఇటువంటి సేవా దృక్పథంతో మంచి నీరు అందించినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తు, ప్రజలతో ఎప్పుడు మమేకం అయ్యి వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడింది అంటే అది ఒక్క జనసేన పార్టీ అని లోకం మాధవి గారి లాంటి నాయకులు ని మేము ఇంతక ముందు ఎన్నడూ చూడలేదని ఇలాంటి వారిని గెలిపించుకుంటామనిజనసేన అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని మరొక్కసారి నిరూపించిన లోకం మాధవి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way