
బెంగళూరు ( జనస్వరం ) : బెంగళూరులో ఉంటున్న జనసైనికులు ” పవనిజం డే ” సందర్భంగా యస్ క్యూర్ వృద్ధాశ్రమము నందు ఆన్నదాన కార్యక్రమ0 నిర్వహించారు. జనసైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినీ ప్రస్థానం చేసిన రోజు అక్టోబర్ 11 ఆ రోజున మా అభిమానులంతా కలిసి వరల్డ్ పవనిజం సేవా సంస్థ ఏర్పాటు జరిగిందని అన్నారు. సమాజానికి దేశానికి పనిచేయడమే నిజమైన జీవితమని చెప్పిన మాటల స్ఫూర్తితో ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యల మీద మరియు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాంటి మహనీయుడుకు మేమందరం కార్యకర్తల అవడం చాలా గర్వంగా ఉందని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ వరల్డ్ పవనిజం డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్, అనంత కళ్యాణ్ రెడ్డి, జగదీష్ ఆనంద్, నంద విజయ్ కుమార్, కుశాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.