Search
Close this search box.
Search
Close this search box.

అంబేద్కర్ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ ఆహార నిధి ద్వారా అన్నదానం

అంబేద్కర్

        మాడుగుల ( జనస్వరం ) : నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారి ఆధ్వర్యంలో మాడుగుల లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి నివాళులర్పించారు. అనంతరం J D పేట లో జై భీమ్ యువ సేన ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని రాయపరెడ్డి కృష్ణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సాలువాతో సత్కరించారు. రాయపు రెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు బహుజనుల కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని, మనందరం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలనేనని అన్నారు. అంతటి మహానుభావుడు మనదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని కృష్ణ గారు అన్నారు . అక్కడ నుంచి రాయపరెడ్డి కృష్ణ గారు మాడుగులలో ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ ఆహార నిధి ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way