రంగుల మీద కాదు, రోడ్ల మీద దృష్టి పెట్టండి

    విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ప్రధాన కూడలి దయనీయమైన రోడ్ల పైన జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం యువ నాయకులు ముప్పిన ధర్మేంద్ర ఆధ్వర్యంలో రంగులు మీద కాదు రోడ్ల మీద దృష్టి పెట్టండి అనే స్లోగన్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతం ప్రధాన కూడలి గత కొన్ని నెలలుగా రోడ్లు తవ్వేసి వదిలేయడంతో ప్రమాదాలు మరియు ట్రాఫిక్ కూడా పెరిగింది. వైసీపీ నాయకులుకి ఇవి ఏవి కనిపించకపోవడంతో ఈ కార్యక్రమంతో అయినా కళ్ళు తెరిపించడానికి మరియు చెట్లు కి వైసీపీ రంగులు వేయడానికి కూడా త్రీవరంగా ఖండించారు. పది రోజులు సమయంలో రోడ్లు మరమ్మతులు చెయ్యని పక్షంలో మిత్రపక్షం అయినా టీడీపీతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేప్పటం జరుగుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు పీలా రామకృష్ణ, పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్, 61 వ వార్డు నాయకులు దుంగ దేవన్ రాజు, పార్టీ శ్రేణులు ఆళ్ల శ్రీకాంత్, బంగార్రాజు, నగేష్, గణేష్, లక్ష్మణ్, శేఖర్, అనిల్, లోకేష్, ప్రభ, నాయిడు, pk, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way