పేద కుటుంబానికి హిందూపురం జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయం

హిందూపురం

              ఈ రోజు హిందూపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎర్రగుంట గ్రామానికి చెందిన పేద కుటుంబం కూతురు పెళ్లి నిర్వహించడానికి ఇబ్బంది పడుతుంటే హిందూపురం పట్టణ జనసేన నాయకులు మల్లెపూల మధు గారు నవ దంపతులిద్దరికి కావలసిన పెళ్లి బట్టలను, కొంత నగదును హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి చేతులమీదుగా వారి కుటుంబానికి అందచేశారు. ఆకుల ఉమేష్ గారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఎందరో యువతీ, యువకులు చాలా మంది జన సైనికులుగా మారి నిరంతరం జనసేవలో తరిస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో మేముసైతం అంటూ ముందుంటూ అభాగ్యులపాలిట ఆపద్భాంధవులై ఆపన్నహస్తం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా, మార్గదర్శకులుగా విశేష సేవలందిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి పరిగి మండలం జనసేన పార్టీ నాయకులు సురేష్, శివ, నారాయణ స్వామి, సంజీవ స్పందించి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way