రైతులను తక్షణమే ఆదుకోవాలి : రామచంద్రాపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

రైతులను తక్షణమే ఆదుకోవాలి : రామచంద్రాపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

                రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు రామచంద్రపురం పట్టణములో నివర్ తుఫాను కారణంగా వరి పంట పూర్తిగా మునిగిపోయి తడిసిపోసి మెులకలు రావడం వలన రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. రైతులు వారా సుదాకర్ గారు, కొండేపల్లి శ్రీను గారు ముచ్చిమిల్లి రైతులు, పట్నాల మహలక్ష్మి రావు గారు మద్య నగర్ రైతులు, వారా నాగేశ్వరరావు గారు, కమ్మవారి సావరం రైతులు, యెుక్క నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. వరి రైతులు సమస్యలను శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలుసుకోవడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గంలో నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ అధికారులు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ముచ్చిమిల్లి కమ్మవారి సావరం రైతులు, జనసేన నాయకులు బుంగారాజు గారు, అక్కిరెడ్డి శ్రీను గారు, మిధిల్, రాంబాబు నాయుడు, గొర్రెల గణపతి సందీప్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.