రైతులను తక్షణమే ఆదుకోవాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో నివార్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పొలాలను నియోజకవర్గ జనసేన నాయకులు బాడిశ మురళీకృష్ణ బృందం పంటను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ సుమారుగా ఒక ఎకరానికి 50 వేల నుండి 60 వేల రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని ఈ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి కనీసం ఎకరానికి 40 వేల రూపాయలైన నష్ట పరిహారంగా చెల్లించాలని జనసేన పార్టీ తరుపున మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు తునికిపాటి శివ, నవీన్ మరియు మరియు మండల జనసైనికులు పవన్, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.