రైతులకు తక్షణమే సాయం అందించాలి : శింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ సాకే మురళి కృష్ణ

    శింగనమల, (జనస్వరం) : శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం గోవిందపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి గ్రామంలో కుండపోత వర్షానికి నష్టపోయిన వరి పంటలను పరిశీలించడం జరిగింది. కొన్ని వేల ఎకరాలలో వరి పోలంలోకి వర్షపు నీరు రావటంతో తీవ్ర పంట నష్టంతో లబోదిబోమంటున్న రైతులని పరామర్శించడం జరిగింది.మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం రైతులకు తక్షణ సహాయం కింద 30 వేల రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, సంజీవరాయుడు, సంయుక్త కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ, రాగే శివ, ఏర్రిస్వామి, పెద్ధిరాజు, కిషోర్, దేవరకొండ హరీష్ మరియు రైతులు పాల్గొన్నారు.