పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలి : జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు)

   ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ ఒకటని,దానిలో భాగంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం కాలుష్యనివారణకోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటి వరకు ఏన్నొకార్యక్రమాలు చేపట్టామని,భవిష్యత్ లో కూడా చేపడతామని తెలుపుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిడుగు సతీష్,జిల్లా చిరంజీవి యువత ముఖ్య సభ్యులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, యాగాటి నలమారాజు, శ్రీను పాల్గొన్నారు.