Search
Close this search box.
Search
Close this search box.

నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి : పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

      పిఠాపురం, (జనస్వరం) :  కాకినాడ జిల్లాపిఠాపురం పట్నంలో స్థానిక రామ టాకీస్ రోడ్డు 4వ వార్డు నందు పుణ్యమంతుల సూర్యనారయణ మూర్తి, మేళం బాబీ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, కౌలు రైతులకు అందిస్తున్న సాయం కోసం, ప్రజలకు వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని పిఠాపురం పట్టణం 4వ వార్డులో ఇంచార్జి శేషుకుమారి పిలుపునిచ్చారు. జనసైనికులు వీర మహిళలతో మీ బాధ్యతగా మీతో తోచిన 10 రూ. నుంచి అమౌంట్ ను పార్టీకి డొనేట్ చేయండని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా తోచిన అమౌంట్ డొనేట్ చెయ్యమని పిలుపునిచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్  సీఎం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల సూర్యనారయణ మూర్తి, మేళం రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు వేణు నారాయణరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, పబ్బీరెడ్డి దుర్గా ప్రసాద్, బుర్రా సూర్యప్రకాష్, బంటుపల్లి ప్రసాద్, గొల్లపల్లి గంగ, నామా శ్రీకాంత్, కొనమాచలి దుర్గాప్రసాద్, నామా సాయిబాబు, జనసైనికులు, నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way