
శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం , భామిని మండలంలో మండల స్థాయి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికీ ముఖ్య అతిథులుగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు కాంతి శ్రీ, ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ పాల్గొని కార్యాలయం ప్రారంభం చేశారు. అనంతరం పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్బాన సత్తిబాబు సమక్షంలో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంతి శ్రీ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రతి పల్లెకు వెళ్లే విధంగా కార్యాలయంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యల కోసం పోరాడే విధంగా పార్టీ కార్యాలయం ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయశారు. పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి జన సైనికుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యులతో జనసేనకి ఓటు వేయించాలని, 2024లో ప్రజా ప్రభుత్వం వస్తుందని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని సభా సమేతంగా తెలియజేశారు. గర్భనా సత్తిబాబు బాబు మాట్లాడుతూ 80మంది కౌలు రైతులు చనిపోతే జగనన్న పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు లు వెయ్యకపోయినా పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడించినా రైతులకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులుకు సన్మానం చేసి గుర్తుగా ” 2022- డైరీ ” చిరు గుర్తుగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్బు గారు వీరఘట్టం మండల జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వజ్రగడ జానీ, పాలకొండ నియోజకవర్గ జనసైనికులు పొట్నూరు రమేష్, ప్రశాంత్, వాసు, మన్మధ సీతంపేట జనసైనికులు శ్రీకాంత్, ఉపేంద్ర, చిన్న, విశ్వనాధం, భామిని మండలం నాయకులు మరియు కిరణ్, శ్రీనువాసురావు, కిషోర్, మహేష్, శరత్, తేజ, మనోజ్, వైకుంఠ, ప్రవీణ్, వీరమహిళ ఉష, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.