సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు

               సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహాయం కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని అన్నారు. అదేవిధంగా ఓటు లేని వారు కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మాజీ పార్లమెంటు కన్వీనర్ పోలంరెడ్డి ఇందిరా రెడ్డి గారు, స్థానిక జనసేన పార్టీ నాయకులు పాలపర్తి సురేష్, పినిశెట్టి మల్లికార్జున్, k.వంశీ, m.నరేష్ లు పాల్గొన్నారు.