Search
Close this search box.
Search
Close this search box.

రాయలసీమ దళిత సేన(RDS) ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయం ఏర్పాటు

      అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం  కందుకూరు గ్రామంలో RDT స్కూల్ నందు రాయలసీమ దళిత సేన(RDS) ఆధ్వర్యంలో చైర్మన్ మన్నిల నాగేంద్ర ఆదేశాల మేరకు నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు గ్రామ సర్పంచ్ (ప్రశాంత్) ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామాంజినేయులు మాట్లాడుతూ పుస్తకపఠనం ప్రతి ఒక్కరూ అలవారుచుకోవాలని, పుస్తక జ్ఞానం మన మదిలో ఎప్పటికైనా నిలిచి ఉంటుందని అని తెలిపారు. అలాగే సర్పంచ్ ప్రశాంత్  మాట్లాడుతూ మంచి పుస్తకాలతో యువతకు మంచి మార్గనిర్దేశకం అవ్వాలని, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల అధ్యక్షులు రామాంజినేయులు, జిల్లా అధ్యక్షులు బండారు కుళ్ళాయప్ప, సభ్యులు వంశీ, మణికంఠ, విద్యార్థులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way