Search
Close this search box.
Search
Close this search box.

“ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు

    ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గంలోని 1 వ డివిజన్ కొమడవోలు పంచాయతీలో “ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట” కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను అబద్ధపు ప్రచారాలను ప్రతి ఇంటికి తెలిసేలా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ వివరిస్తూ రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత బలం చేకూర్చుకొని ప్రజలకు అండగా పవన్ కళ్యాణ్ ఉంటారని ప్రజలకు తెలియపరిచారు. ఏలూరు నియోజకవర్గంలో అన్ని డివిజన్ లో ఉన్న ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉన్నదని జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తానని నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1 వ డివిజన్ నాయకులు శేషపు వెంకట దుర్గా ప్రసాద్, నాగులపల్లి మురళి,దంపనబోయిన కృష్ణ, మల్కాపురం మాజీ ఎమ్.పి.టి.సి.జంగా నారాయణరావు, కడలి గణేష్, ఉన్నమట్ల రాఘవాచార్యులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way