తక్షణమే ఎతైన వంతెన నిర్మాణ మరమ్మతులు చేపట్టాలి : రాజంపేట జనసేనపార్టీ నాయకులు

రాజంపేట

       రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని ఊటుకూరు2పంచాయతీ పరిధిలో బవనగిరిపల్లి గ్రామంలో సుమారు రెండు వేల మంది జనాభా అక్కడ నివాసం ఉంటున్నారు. అదేవిధంగా రాజంపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అధిక సంఖ్యలో భక్తులు భారీగా నిరంతరం రవాణా చేస్తూంటారు. బవనగిరిపల్లి సమీపంలో ఉన్న వంతెన సమస్యలను స్థానిక పాలకులు, అధికారులు గుర్తించాలి. తేలికపాటి వర్షానికే ఒక వైపు చెరువు, ఇంకో వైపు పులంగి ఏరు, ఇరువైపులా వంతెన వద్ద వర్షపు నీరు అధికంగా చేరి తడుముకొని గుడికి, అక్కడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ, ప్రస్తుతం కొనసాగుతున్న రాజంపేటకు సంబంధించి శాసనసభ సభ్యుడు మెడ వెంకట మల్లికార్జున రెడ్డి, లోకసభ సభ్యుడు పెదిరెడ్డి మిథున్ రెడ్డి, వారికేమో ఎలక్షన్లు వస్తే అక్కడ ప్రజలు ఓట్లు కోసం వాగ్దానాలు చేసినవి, హామీలు పలికినవి వారు వేసిన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా అందలమెక్కిన తర్వాత అక్కడ గ్రామస్థుల సమస్యలు మాత్రం పట్టనట్లు గిట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శిస్తూ హెచరిక జారి చేశారు. స్థానిక పాలకులు, సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణ నిధులు కింద మంజూరు చేసి ఎతైన వంతెన నిర్మాణ మరమ్మతులు వెంటనే చేపట్టాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way