వైకాపా ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు 9సార్లు పెరిగిన విద్యుత్ చార్జీలు

  అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా 40వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 35వ డివిజన్ మంగళవారి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలనుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఏఇంటికి వెళ్లిన ఏమహిళను అడిగిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచడం ద్వారా విపరీతంగా బిల్లులు వచ్చి లైట్ కానీ ఫంకా కానీ వేయలంటేనే భయంగా ఉందని అన్నారు. ఈ జగన్ రెడ్డి ప్రజలను కరెంట్ ఉన్న పెరిగిన రేట్లతో ఉపయోగించుకునే పరిస్తితి లేక తిరిగి కరెంట్ లేని కాలానికి ప్రజలను తీసుకెళ్లాడని ఒక్క ఛాన్సు అని అధికారం కట్టపెడితే జీవితాలలో వెలుగులు లేకుండా చేసాడన్నారు.. దీనితో పాటు ఇక్కడ డివిజన్ లో మురుగుకాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని దీనికి తోడు మంచినీటి కొరతకుడా విపరీతంగా ఉందని ప్రజలకు ఏ మాత్రం మేలు చేయమి ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోరే జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way