భూమి పట్టాల సమస్యలపై పోరాడుతున్న ఎచ్చర్ల జనసేన నాయకులు

        అప్పటి  YS రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము హయాంలో  2004  సంవత్సరములో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం  భోనోజీ రావు పేట గ్రామంలో పేదలకు పట్టాలు మంజూరు చేసినారు. ఇప్పటి వరకు ఆ ఇచ్చిన పట్టాలకి ఏ నాయకులు కూడా వారికి భూమిని చూపించలేదు. వారిలో కొంతమందికి బ్యాంకులో లోన్ ఇప్పించారు. ఇప్పటికి  ఆర్ డి ఓ & ఎమ్మార్వో చొరవ తీసుకుని పట్టాలు మంజూరు చేసి వారి భూమిని వారికి తిరిగి ఇస్తామని భరోసా ఇచ్చారు.  భానోజీ రావు పేట గ్రామంలో ఎమ్మార్వో సుధా సాగర్, ఆర్ ఐ శ్రీనివాస్ , వీఆర్వో, సర్వేయర్లు హాజరై వారి సమస్యలు తెలుసుకుని సర్వేయర్ వెంటనే నియమించి ఎవరి భూమి వారికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంట సంధ్య గజపతి రావు గారు, వావిలపెల్లి విష్ణు మూర్తి , కింతలి ఈశ్వరరావు, సుర చలపతిరావు, పైడి రాజశేఖర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.