అంగన్వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పిల్లలను పరామర్శించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కాంతి శ్రీ గారు

ఎచ్చెర్ల

    ఎచ్చెర్ల, (జనస్వరం) : లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో నేతేరు అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు, పాలు తీసుకోవడంతో పదిమంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి మరుక్షణం గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని బాధిత పిల్లలని, వాళ్ల కుటుంబాల్ని కలిసి జరిగిన ప్రమాదం గురించి వైద్యులతో మాట్లాడి వాళ్లకి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కాంతి శ్రీ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వట్లేదని తరచూ ఈ సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి భావితరాల పౌరుల బంగారు భవిష్యత్తు పైన శ్రద్ధ చూపాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గరావు, సూర్య, బాబాజీ అలాగే సాయి, నిఖిల్, జయప్రకాశ్, తిరు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way