దుగ్గుదూరు గ్రామం కొత్త వంతెనను అధికారులు తక్షణమే నిర్మించాలి: రామచంద్రపురం జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో వంతెన కూలిపోవడం కారణంగా మరియు ప్రక్కన ఉన్న రహదారి మార్గం కూడా పూర్తిగా నీరు మునిగిపోవడం జరిగింది. అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురయ్యి ఇరువైపులా రహదారి స్తంభించిపోవడం మరియు బ్రిడ్జ్ రహదారి నీటికి కొట్టుకొనిపోవడం, వంతెనకు రంధ్రాలు పడిపోవడం ప్రజలను తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య పై రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు దుగ్గుదూరు గ్రామం లోని ఆ వంతెనను సందర్శించి రైతులు తమ యెుక్క సమస్య లను తెలియజేయడం జరిగింది. ఈ వంతెనకు సంబంధించిన అధికారులు తక్షణమే కొత్త వంతెనను నిర్మించాలని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు యాళ్ళ వేణుగోపాలరావు గారు, బుంగారాజు గారు, కోటా శ్రీనివాస రావు గారు, సంపత్, క్రిష్ణ చైతన్య, డేగల సతీష్, ఆనంద్, మిధిల్, రాంబాబు నాయుడు, మణీంద్ర,నున్న విష్ణు మూర్తి, రత్న కుమార్, యాళ్ళ రవి, పెద్దిరెడ్డి సతీష్, యేరుబండి నాని, నామా విష్ణుచక్రం, బాలరాజు, కాండూరి సూర్యనారాయణమూర్తి, పైడికొండల వీర నాగేశ్వరరావు, పైడికొండల దుర్గారావు నాగరాజు, మణికంఠ నేతికొండ, వినకోటి నుకారావు, కౌలు రైతులు కమిడి సత్యనారాయణ, జోడా భీమరాజు తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.