
● 7వ రోజు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్.
సూళ్లూరుపేట, (జనస్వరం) : మునిరత్నం నగర్ 4వ వీధిలో డ్రైనేజీ పారుదలకు అవకాశం లేకుండా ఇంకుడు గుంట తవ్వి వదిలేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గాంధ భరితంగా తయారయ్యి దోమలకి నిలయంగా ఉంది. దీనివల్ల అక్కడి ప్రజలు తరచుగా జబ్బుల బారిన పడుతున్నారు. సుమారు 10 అడుగుల లోతు ఉన్న ఈ ఇంకుడు గుంట అంగన్వాడి బడి ఎదురుగ ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని బయపడుతున్నామని స్థానికులు ఉయ్యాల ప్రవీణ్ కు తెలిపారు. ఆ ప్రాతంలో వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రిళ్ళు ఎవరైనా తెలీక ప్రమాదవశాత్తు ఆ ఇంకుడు గుంతలో పడి మరణించే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు బాధపడ్డారు. పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రజల తరపున ఉయ్యాల ప్రవీణ్ కోరారు.