సీతవలసలో తాగు నీరు సమస్య తీర్చిన డా. విష్వక్సేన్

      రణస్థలం ( జనస్వరం )  మండలంలోని సీతవలస గ్రామంలో తాగు నీరు సమస్య ఎక్కువ ఉందని ఆ గ్రామ జనసేన నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు (ఇంచార్జ్) డా విష్వక్సేన్ దృష్టికి తీసుకు రావడంతో స్వంత నిధులతో తాగునీటి సమస్యను తీర్చారు. వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామంలో రెండు రోజుల క్రితం పర్యటించి మహిళలు నుంచి వారి కష్టాలను తెలుసుకొని రెండు రోజుల్లో ఈ గ్రామానికి చెందిన అధికార పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు సమస్యను పరిష్కరించకుంటే నేనే పరిష్కరిస్తా అని చెప్పారు. నేపథ్యంలో ఎటువంటి పురోగతి లేకపోవడం తో విష్వక్సేన్ 2వేల లీటర్ల ట్యాంక్ రూ. 18 వేలు ఇచ్చారు. స్థానిక జనసేన నాయకులు మరికొంత మొత్తంతో ఆ గ్రామంలో రెండు వీధులకు పైప్ లైన్ తో వాటర్ సప్లై ఇచ్చి శుక్రవారం మహిళలకు అందించారు. ఈ కార్యక్రమం లో రణస్థలం మండల జనసేనఅధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, నాయకులు గొర్లె సూర్య, వడ్డాది శ్రీనివాసరావు, లావేరు మండల అధ్యక్షులు దుర్గారావు, కాకర్ల బాబాజీ, అప్పలకొండ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way