దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

డాక్టర్ కందుల

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 99వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. సహాయం అడిగిన వారికి కాదనకుండా తక్షణమే వారికి సహాయం చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు పెళ్లి కుమారులకు అండగా నిలిచారు. 33 వ వార్డుకు చెందిన పెళ్లి కుమార్తె తిరుమలకు అలాగే 34 వ వార్డుకు చెందిన పెళ్ళికూతురు కృష్ణవేణికి తాళిబొట్లు, పట్టు చీర జాకెట్లు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులైన సరే ప్రజలకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, అజయ్, మణి, మణికంఠ, జయ, వెకటేష్, కోదండమ్మ, శ్రీదేవి, మంగ, అరుణ, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల బద్రీనాథ్ తోపాటు జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way